AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుచ‌రుడి మ‌ర‌ణం‌..క‌న్నీళ్లు పెట్టుకున్న‌ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైసీపీ నాయ‌కుడు మోకా భాస్కర్‌రావు భౌతిక ఖాయానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించారు.

అనుచ‌రుడి మ‌ర‌ణం‌..క‌న్నీళ్లు పెట్టుకున్న‌ మంత్రి పేర్ని నాని
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2020 | 6:06 PM

Share

మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైసీపీ నాయ‌కుడు మోకా భాస్కర్‌రావు భౌతిక ఖాయానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించారు. భాస్కర్‌రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి గురై క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం భాస్కర్‌రావు కుటుంబాన్ని మంత్రి ఓదార్చి..అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు.

కాగా, మునిపిపాలిటి ప‌రిధిలోని‌ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కర్‌రావును దుండగులు కత్తితో పొడిచి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రికి తరలించారు. లోతైన గాయాల‌తో పాటు అధిక ర‌క్త‌స్రావం కావ‌డంతో చికిత్స పొందుతూ భాస్కర్‌రావు మరణించారు.

దుండగులు పక్కా స్కెచ్ తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును మ‌ర్డ‌ర్ చెయ్యాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ హత్యలో ఇద్దరు వ్య‌క్తులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు క‌థ‌నాలు వివ‌రిస్తున్నాయి. ఈ హ‌త్య‌ను సీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భాస్కర్‌రావు హత్య విషయం తెలుసుకున్న వైసీపీ కార్య‌కర్త‌లు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌రావును హత్య చేసిన నిందితులను వెంట‌నే ప‌ట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆస్పత్రి వద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం‌ నెలకొంది.