AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు కింద పడినా.. మృత్యుంజయుడే…

ఒడిషాలో అద్భుతం చోటుచేసుకుంది. జార్సు గూడ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి చావు నోట్లో తలపెట్టి బయటపడ్డాడు. ఒడిషా వెళ్తున్న రైలు.. జార్పగూడ స్టేషన్‌లో ఆగింది. దీంతో ప్రయాణికుడు టీ తాగేందుకు కిందకు దిగాడు. అయితే టీ తాగుతుండగా.. ప్లాట్‌ఫాం నుంచి రైలు కదలడం చూశాడు. వెంటనే రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఆయన.. కాలు స్లిప్ అయ్యి.. ట్రాక్ – ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు.. అతన్ని లాగేందుకు ప్రయత్నించారు. ఇది […]

రైలు కింద పడినా.. మృత్యుంజయుడే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 10:33 AM

Share

ఒడిషాలో అద్భుతం చోటుచేసుకుంది. జార్సు గూడ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి చావు నోట్లో తలపెట్టి బయటపడ్డాడు. ఒడిషా వెళ్తున్న రైలు.. జార్పగూడ స్టేషన్‌లో ఆగింది. దీంతో ప్రయాణికుడు టీ తాగేందుకు కిందకు దిగాడు. అయితే టీ తాగుతుండగా.. ప్లాట్‌ఫాం నుంచి రైలు కదలడం చూశాడు. వెంటనే రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఆయన.. కాలు స్లిప్ అయ్యి.. ట్రాక్ – ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు.. అతన్ని లాగేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన రైల్వే అధికారులు ట్రైన్ నిలిపివేశారు. వెంటనే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడకు చేరుకుని అతన్ని సురక్షితంగా రక్షించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ప్రయాణికుడు మళ్లీ అదే ట్రైన్‌లో వెళ్లిపోయాడు. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్థుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.