రూ. 30వేలకు ఆశపడ్డ తల్లి..9 ఏళ్ల కూతురికి పెళ్లి

మన దేశంలో అనాదిగా వస్తున్న దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒకటి. 18 ఏళ్లు నిండాకే అమ్మాయిలకే పెళ్లిల్లు చేయాలని చట్టం ఎంత మొత్తుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే వారు చెప్పుకోలేన బాధలను అనుభవించాల్సి వస్తోంది. ఓ వైపు ఆరోగ్యం బాగా లేక, మరో వైపు సమాజం విధించే కట్టుబాట్లను ఎదిరించలేక, విధికి తలొగ్గి బతుకు పోరాటంలో అలాగే ముందుకు సాగుతూ జీవితం వెల్లదీస్తున్నారు. దీంతో కొంత […]

రూ. 30వేలకు ఆశపడ్డ తల్లి..9 ఏళ్ల కూతురికి పెళ్లి
Follow us

|

Updated on: Nov 13, 2019 | 5:18 PM

మన దేశంలో అనాదిగా వస్తున్న దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒకటి. 18 ఏళ్లు నిండాకే అమ్మాయిలకే పెళ్లిల్లు చేయాలని చట్టం ఎంత మొత్తుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే వారు చెప్పుకోలేన బాధలను అనుభవించాల్సి వస్తోంది. ఓ వైపు ఆరోగ్యం బాగా లేక, మరో వైపు సమాజం విధించే కట్టుబాట్లను ఎదిరించలేక, విధికి తలొగ్గి బతుకు పోరాటంలో అలాగే ముందుకు సాగుతూ జీవితం వెల్లదీస్తున్నారు. దీంతో కొంత మంది నడివయస్సు వచ్చే సరికి తీవ్రమైన అనారోగ్యాలు, వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంకా కొందరు ఎంతగానో మానసిక క్షభను, ఆవేదనను అనుభవిస్తున్నారు. అయితే, ఒకప్పుడు దీని ప్రభావం మన దగ్గర బాగా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అంతగా లేదని చెప్పాలి. ఎక్కడో ఓ చోట మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్న బాల్య వివాహన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఔరంగాబాద్‌ జిల్లా మజల్‌గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అషమతి గోలాప్‌ అనే మహిళ తన 9 ఏళ్ల కూతురిని వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అషమతి స్నేహితురాలు ఉర్మిళా యాదవ్‌ 20 ఏళ్ల కొడుకుతో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బదులుగా వరుడి తరపు నుంచి రూ. 30 వేల నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ముహూర్తం కూడా పెట్టించారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా విషయం బయటకు తెలిసి పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..పెళ్లిని ఆపించేశారు. బాల్య వివాహం చేసేందుకు సిద్దపడిన బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.