అంత‌రించిపోయింద‌నుకున్న పాము.. 129 ఏళ్ల తర్వాత కనిపించింది

ఆ పాము అంత‌రించిపోయింది. వంద సంవ‌త్స‌రాల దాటిన ఇంత‌వ‌ర‌కు దాని జాడ క‌నిపించ‌లేదు. అయితే అనూహ్యంగా ఆ జాతి పాము అసోంలో కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సైంటిస్టులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అంత‌రించిపోయింద‌నుకున్న పాము.. 129 ఏళ్ల తర్వాత కనిపించింది
Follow us

|

Updated on: Jun 29, 2020 | 7:10 PM

ఆ పాము అంత‌రించిపోయింది. వంద సంవ‌త్స‌రాల దాటిన ఇంత‌వ‌ర‌కు దాని జాడ క‌నిపించ‌లేదు. అయితే అనూహ్యంగా ఆ జాతి పాము అసోంలో కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సైంటిస్టులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వాటి జాతి అంత‌రించిపోయింద‌నుకున్న 129 ఏళ్ల త‌ర్వాత ఆ పాము క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. 1891లో హెబియస్ పెల్లీ (అసోం కీల్​బాక్) పాములు బ్రిటీష్ టీ ప్లాంటర్ శామ్యూల్​ ఎడ్వర్డ్ పీల్ కు తార‌స‌ప‌డ్డాయి. ఆయ‌న‌ ఈ జాతికి చెందిన రెండు మగ పాములను సేక‌రించి..ఒకటి కోల్​కతాలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, మరొక‌టి లండన్​లోని నేచురల్​ హిస్టరీ మ్యూజియానికి తరలించారు. ఆ తర్వాత హెబియస్ పెల్లీ జాతి పాములు ఎక్క‌డా, ఎవ‌రికీ క‌నిపించ‌లేదు.

దాంతో స‌ద‌రు పాము జాతి అంత‌రించిపోయింద‌ని..ఇంక అవి క‌నిపించ‌వ‌ని అందరూ అను‌కున్నారు. అయితే అనూహ్యంగా 2018 సెప్టెంబర్​లో ఎడ్వర్డ్ పీల్ కి క‌నిపించిన‌ ప్రాంతంలోనే వైల్డ్​ లైఫ్ ఇనిస్టిట్యూట్​ సైంటిస్టులకు మళ్లీ ఈ పాము చిక్కింది. వెటర్బేట్​ జువాలజీ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ జర్నల్​లో ఈ విషయాన్ని గ‌త‌ శుక్రవారం ప్రచురించారు.

తమకు కనిపించిన పాముకి అసోం కీల్​బాక్ ఆన‌వాళ్లు ఉండ‌టంతో… వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు లండన్ నేచురల్ మ్యూజియంలో ఉన్న పాము ఆనవాళ్లతో పోల్చి చూసుకుని ఈ విష‌యాన్ని క‌న్ఫామ్ చేశారు. 50 నుంచి 60 సెంటీమీటర్ల వరకూ ఉండే అసోం కీల్​బాక్​ పాములు అంత‌ విషపూరితమైనవి కావ‌ని సైంటిస్టులు తెలిపారు.