AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై టెన్షన్ వైర్లను తాకిన పార్సిల్ లారీ, పక్కనుండి వెళ్తున్న బైక్ పై వైర్లు పడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం

కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తోన్న పార్సిల్ లారీ.. పైన ఉన్న హై టెన్షన్ కేబుల్స్ ను తాకింది...

హై టెన్షన్ వైర్లను తాకిన పార్సిల్ లారీ, పక్కనుండి వెళ్తున్న బైక్ పై వైర్లు పడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం
Venkata Narayana
|

Updated on: Dec 19, 2020 | 1:55 PM

Share

కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తోన్న పార్సిల్ లారీ.. పైన ఉన్న హై టెన్షన్ కేబుల్స్ ను తాకింది. అయితే, అదే సమయంలో లారీ పక్కనుండి వెళ్తోన్న బైక్ మీద కూడా ఆ వైర్లు పడి బైక్ మీదున్న ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు. మృతి చెందిన వ్యక్తులు నూజివీడు మండలం మీర్జాపురం వాసులుగా గుర్తించారు. లారీకి మంటలు అంటుకోవడంతో ప్రమాదాన్ని ముందే గుర్తించి కంటైనర్ నుండి దూకి లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు దక్కించుకున్నారు. బైక్ పై వస్తోన్న వాహనదారులు మాత్రం విద్యుత్ ఘాతానికి గురై ఘటనా స్థలంలోనే సజీవదహనమై బుగ్గిగా మారిపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, అగ్నిమాపక దళ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఇద్దరు మీర్జాపురం గ్రామానికి చెందిన పెనుమాక జ్యోతిబాబు, షేక్ మస్తాన్ గా పోలీసులు గుర్తించి, మృతదేహాలను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.