AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దదవుతున్న దివీస్‌ గొడవ..పీక్స్‌కు చేరిన అల్లర్లు..గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టిన మత్స్యకారులు

దివీస్‌ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులగా జరుగుతున్న అల్లర్లు పీక్స్‌కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్‌ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్‌ నిర్మించిన ఓ గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు..

పెద్దదవుతున్న దివీస్‌ గొడవ..పీక్స్‌కు చేరిన అల్లర్లు..గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టిన మత్స్యకారులు
Sanjay Kasula
|

Updated on: Dec 17, 2020 | 6:11 PM

Share

దివీస్‌ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులగా జరుగుతున్న అల్లర్లు పీక్స్‌కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్‌ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్‌ నిర్మించిన ఓ గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు ఉద్యమకారులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకొచ్చారు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను పీకి పారేశారు.

ఫ్యాక్టరీలో ఉన్న కంటైనర్‌, జనరేటర్‌ను తగలబెట్టారు. నిర్మాణంలో ఉన్న గోడలను కూలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని భావించడంతో.. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంటనే విడుదల చేయాలని.. స్థానికులు అక్కడే బైఠాయించారు.

తూర్పుతీరంలో దివీస్‌ లేబరేటరీస్‌ ల్యాబ్‌.. పొలిటికల్‌ గేమ్‌కు అద్దం పడుతోంది. కొత్త యూనిట్‌ ఏర్పాటుపై అధికార, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. గతంలో ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడంతో.. స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ ల్యాబ్‌ విషయంలో.. వైసీపీ, టీడీపీల తీరు అవకాశవాద రాజకీయాలను గుర్తు చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దివిస్‌ ల్యాబ్‌ను ఒప్పుకునేది లేదని మత్స్యకారులు తెగేసి చెబుతున్నారు. ల్యాబ్ ఏర్పాటుతో మత్స్యకారులకు నష్టం ఏర్పడటంతో పాటు.. జీవనోపాధి దెబ్బతింటుందని నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఒకే పరిశ్రమపై టీడీపీ-వైసీపీలు భిన్నస్వరాలు వినిపిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంపై అవకాశవాద రాజకీయాలకు దిగుతున్నాయని మండి పడుతున్నారు. తమ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ నిర్మాణం వద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌