AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..

పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 3గంటలకు అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరుగనుంది. అక్కన్న మాదన్న ఆలయాలతో

పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2020 | 1:43 PM

Share

Lal Darwaza Bonalu Starts in Hyderabad: తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 3గంటలకు అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరుగనుంది. అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు మొదలైయ్యాయి. ఆలయ కమిటీ అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుతున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు. ఆలయ కమిటీ సభ్యులు బోనాల సమర్పణ చేయనున్నారు. బోనాల సందర్భంగా నాగుల చింత నుండి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పీఎస్ నుండి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లు మూసివేసారు.

లాల్ దర్వాజ బోనాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. ఆలయ పూజారులు బలిహరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇళ్లలోనే బోనం చేసుకుని అమ్మవారికి సమర్పిస్తున్నారు. సాయంత్రం ఆలయ కమిటీ, అర్చకుల సమక్షంలో శాంతి కల్యాణం జరుగనుంది. ప్రతియేడు చేసే సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్నారు. ఆలయ సిబ్బంది రంగురంగుల పూలతో అమ్మవారిని అందంగా అలంకరించారు.

Also Read: గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం