AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మెడిసిన్: రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్!

కోవిద్-19 విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి.

కరోనా మెడిసిన్: రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 08, 2020 | 11:08 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం లిస్టులోకి ఇప్పుడు ‘ఇమ్యూనిటీ సందేశ్‌’ అనే స్వీట్‌ వచ్చి చేరింది.

వివరాల్లోకెళితే.. స్వీట్‌ తయారీ అంటే అందులో బెల్లం గాని, చక్కెర గాని తప్పనిసరి. కానీ, ఈ ఇమ్యూనిటీ స్వీట్‌లో చక్కెర, బెల్లం రెండూ వాడలేదు. బదులుగా హిమాలయ తేనెను ఉపయోగించారు. అంతేకాదు 15 రకాల మూలికలతో స్వీట్‌ను తయారు చేశారు. తులసి, పసుపు, ఏలకులు, లైకోరైస్‌, జాజికాయ, అల్లం, గాలాంగల్‌, పీపుల్‌, నల్ల మిరియాలు, నల్ల జీలకర్ర, బే ఆకులు వంటి మూలికలను తీసుకున్నామని కోల్‌కత్తా స్వీట్‌ షాపుకు చెందిన అధిపతి సుదీప్‌ మల్లిక్‌ చెప్పుకొచ్చారు.

మామూలుగా అయితే సదరు మూలికలన్నింటినీ వంటలకు వాడతాం. ఇవి కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయుర్వేద నిపుణులను సంప్రదించి దీని తయారీకి పూనుకున్నారు. చక్కెర లేదా బెల్లం ఈ మూలికల సామర్థ్యాన్ని తగ్గించగలదని, అందుకే తేనెను దాని స్థానంలో ఉపయోగించారని చెప్పారు. రెండురోజుల నుంచి 25 రూపాయలకు ‘ఇమ్యూనిటి సందేశ్‌’ను విక్రయిస్తున్నారు.