AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటక ముఖ్యమంత్రికి కోపం వచ్చేసింది..!

కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కోపం వచ్చేసింది..ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తూ ... కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించని జనంపై అసహనం కూడా కలిగింది.. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా సరేసరి.. లేదూ మళ్లీ లాక్‌డౌన్‌ విధించేస్తాను అంటూ కోపంగా ప్రజలను హెచ్చరించారు యడియూరప్ప.

కర్నాటక ముఖ్యమంత్రికి కోపం వచ్చేసింది..!
Balu
|

Updated on: Jun 25, 2020 | 2:30 PM

Share

కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కోపం వచ్చేసింది..ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తూ … కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించని జనంపై అసహనం కూడా కలిగింది.. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా సరేసరి.. లేదూ మళ్లీ లాక్‌డౌన్‌ విధించేస్తాను అంటూ కోపంగా ప్రజలను హెచ్చరించారు యడియూరప్ప.. లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి తేకుండా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని హితవు కూడా చెప్పారు .. కర్నాటకలో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.. కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి యడియూరప్ప అధికారులతో సమీక్ష నిర్వహించారు.. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బెంగళూరులో అయితే కేసులు బాగా పెరుగుతుండటంతో నగరంలో ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు అధికారులు.