బీహార్లో దారుణం.. జేడీయూ నేత దారుణహత్య!
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. జేడీయూకు చెందిన ఓ నేత దారుణహత్యకు గురయ్యారు. మాధేపురా జిల్లాకు చెందిన ఆశోక్ యాదవ్ (50) అనే జేడీయూ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. జేడీయూకు చెందిన ఓ నేత దారుణహత్యకు గురయ్యారు. మాధేపురా జిల్లాకు చెందిన ఆశోక్ యాదవ్ (50) అనే జేడీయూ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అశోక్యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జేడీయూ గాంహరియా బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నఅశోక్యాదవ్ తన స్వగ్రామం జోగ్బానీలో ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న సమయంలో ఈ హత్య జరిగిందని మాధేపురా పోలీసులు తెలిపారు.
బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అశోక్యాదవ్పై కాల్పులు జరిపి పారిపోయినట్లు మాధెపురా పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగిన వెంటనే స్థానిక సుపాల్ సదర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని, ఆశోక్ యాదవ్పై కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read More: