Warangal: ఐటీ రంగంలో మరో ముందడుగు.. వరంగల్లో ఏర్పాటుకానున్న జెన్పాక్ట్
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లో మరో ఐటీ కంపెనీ కొలువుదీరనుంది. ఇప్పటికే పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకాగా తాజాగా జెన్పాక్ట్ కూడా వచ్చేస్తోంది.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లో మరో ఐటీ కంపెనీ కొలువుదీరనుంది. ఇప్పటికే పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకాగా తాజాగా జెన్పాక్ట్ కూడా వచ్చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాజీపేట మండలం మణికొండలోని స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎస్ఈజెడ్)లో టెక్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నట్లు జెన్పాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కంపెనీని ఆహ్వానిస్తూ మంత్రి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘వరంగల్ పట్టభద్రులకు జెన్పాక్ట్ మరో సువర్ణావకాశం కల్పిస్తోంది. ఉన్నచోటే ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా వరంగల్లో ఇప్పటికే సైయంట్ టెక్, టెక్ మహేంద్ర, కాకతీయ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తదితర ప్రముఖ సంస్థలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. తాజగా జెన్పాక్ట్ ఏర్పాటుతో ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఐటీ నిపుణులు అంచనావేస్తున్నారు.
కాగా మరోవైపు పెడిగ్రీ( పెంపుడు జంతువుల పోషకాహారం) తయారీ కోసం మార్స్ పెట్కేర్ తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మరో రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ సంస్థ హైదరాబాద్ నగరంలో 2008లో తన ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. కుక్కలతో పాటు ఇతర పెంపుడు జంతువులు తినే ఆహార పదార్థాలు ఇక్కడ తయారవుతున్నాయి. దశాబ్ద కాలంగా పెంపుడు జంతువులకు పోషక ఆహారం అందించే విషయంలో ప్రజలకు అవగాహన పెరిగింది. ఫలితంగా ఈ మార్కెట్ పుంజుకుంది. పెడిగ్రీ బ్రాండ్ పెట్ ఫుడ్ మన హైదరాబాద్లోనే తయారవుతోంది. పెరుగుతున్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని ఫ్యాక్టరీ కెపాసిటీని పెంచాలని నిర్ణయించారు. ఇందు కోసం రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు మార్స్ పెట్కేర్ సంస్థ వెల్లడించింది. కాగా పాత ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 65 కిలోటన్నులకు పెంచడం ద్వారా హైదరాబాద్ నుంచే మన దేశంతో పాటు ఇతర ఆసియా దేశాలకు పెంపుడు జంతువుల ఆహారం సరఫరా కానుంది.
Delighted to announce that @Genpact has chosen to set up a tech centre at Warangal
My compliments to CEO @tyagarajan and his team on supporting our endeavour to strengthen IT in tier 2 towns
After Tech M, Cyient and now with Genpact’s decision, Warangal is set to soar high? pic.twitter.com/UUX8nBSVdw
— KTR (@KTRTRS) December 16, 2021
Also Read:
Telangana: నేడు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం.. చర్చకు రానున్న పలు కీలక అంశాలు..