IPL 2020: గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా.! ఓడిపోయి కేకేఆర్‌కు దారి ఇస్తుందా.?

ఐపీఎల్ 2020లో నేడు లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ జరగనుంది. నేడు షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడనున్నాయి.

IPL 2020: గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా.! ఓడిపోయి కేకేఆర్‌కు దారి ఇస్తుందా.?
Follow us

|

Updated on: Nov 03, 2020 | 11:28 AM

IPL 2020: ఐపీఎల్ 2020లో నేడు లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ జరగనుంది. నేడు షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్ వార్నర్ సేనకు చాలా కీలకమైంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ఎలిమినేట్ అవుతుంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏడింటిలో ఓడిపోయి.. ఆరింటిలో గెలుపొందింది.  అటు ముంబై ఆడిన 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు సాధించి.. అగ్రస్థానంలో నిలిచింది.

హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ పెద్ద మైనస్. వార్నర్, సాహా, బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్‌ల నుంచి ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్కోర్లు ఏమి రాలేదు. అప్పుడప్పుడూ బ్యాట్ ఝుళిపించడం తప్పితే.. వీరు ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణించట్లేదు. ఇక వార్నర్ సేనకు  బౌలర్లే ప్రధాన బలం. సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, హోల్డర్, నటరాజన్‌తో ఆ జట్టు బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. బ్యాట్స్‌మెన్ కూడా స్థాయికి తగ్గట్టు ఆడితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తప్పక విజయం సాధిస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరడంతో.. ఈ మ్యాచ్‌లో పలు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంచ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్, బౌలర్లకు ఛాన్స్ ఇవ్వచ్చు.