కరోనాతో చనిపోతే బీమా పరిహారం ఇవ్వాల్సిందే.. జీవిత బీమా మండలి ఆదేశం..

| Edited By: Pardhasaradhi Peri

Apr 06, 2020 | 3:54 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది.

కరోనాతో చనిపోతే బీమా పరిహారం ఇవ్వాల్సిందే.. జీవిత బీమా మండలి ఆదేశం..
Follow us on

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిష్కార ప్రక్రియను వేగంగా చేపట్టాలని సూచించింది. కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌కు ‘ఫోర్స్‌ మెజర్‌’ నిబంధన వర్తించదని వెల్లడించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్‌ మెజర్‌’ను అమలు చేస్తారు. కరోనాకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి తెలిపింది.తమ వినియోగదారులకు ఈ విషయం వ్యక్తిగతంగా వెల్లడించాలని బీమా సంస్థలకు మండలి ఆదేశించింది.

ప్రపంచ మహమ్మారి కొవిడ్‌-19 ఇంట్లో ప్రతి ఒక్కరికి జీవిత బీమా ప్రాథమిక అవసరమని నొక్కిచెబుతోంది. లాక్‌డౌన్‌ వల్ల వినియోగదారులకు కలిగిన అంతరాయాన్ని తగ్గించేందుకు జీవిత బీమా రంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ సంక్లిష్ట సమయంలో కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌ సహా ఎన్నో సేవలను డిజిటల్‌ రూపంలో అందజేస్తున్నాం.. అని జీవిత బీమా మండలి సెక్రెటరీ జనరల్‌ ఎస్‌ఎన్‌ భట్టాచార్య తెలిపారు. ఏప్రిల్‌ నెలలో జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లించే వినియోగదారులకు మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తున్నామని ఐఆర్‌డీఏఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే.