విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన, 2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌ విధించిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి.

విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన,  2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్
Follow us

|

Updated on: Dec 07, 2020 | 3:34 PM

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి.  ఈ క్రమంలో క్యాన్సిల్ అయిన విమానాలకు టికెట్​ బుక్​ చేసుకున్న పాసింజర్స్ అందరికీ డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో అనౌన్స్ చేసింది. వారందరికీ 2021 జనవరి 31లోపు డబ్బు రీఫండ్ చేస్తామని తెలిపింది.

అందుకోసం  ఇప్పటికే రూ.1,000 కోట్లను ప్రాసెస్ చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ మొత్తం తమ ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్​లో 90 శాతానికి సమానమని వివరించింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఒక్కసారిగా లాక్​డౌన్ విధించడం వల్ల ఆదాయం పడిపోయిందని ఇండిగో పేర్కొంది. అందువల్లనే వెంటనే రీఫండ్ చేయలేకపోయామని తెలిపింది. దేశీయంగా విమాన ప్రయాణాలు కొనసాగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే ఆదాయం పెరుగుతోందని వివరించింది.

Also Read : అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే