వీల్ చైర్ అడిగితే.. జైల్లో పెట్టిస్తానన్న ఇండిగో పైలట్!
ఓ ఇండిగో పైలట్ నిన్న చెన్నై-బెంగళూరు విమానంలో ప్రయాణికులపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సోమవారం రాత్రి ఇండిగో విమానంలో ప్రయాణించిన సుప్రియ ఉన్ని నాయర్ ట్వీట్లో తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన 75 ఏళ్ల వయసుగల తల్లితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. తన తల్లి మధుమేహంతో బాధపడుతున్నందువల్ల ఓ వీల్ చైర్లో కూర్చుండబెట్టి తీసుకెళ్లాలని అనుకున్నట్లు తెలిపారు. విమానం వద్దకు వీల్చైర్ను తీసుకొచ్చిన తర్వాత పైలట్ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తల్లీకూతుళ్ళను ఒక రాత్రి జైలులో […]
ఓ ఇండిగో పైలట్ నిన్న చెన్నై-బెంగళూరు విమానంలో ప్రయాణికులపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సోమవారం రాత్రి ఇండిగో విమానంలో ప్రయాణించిన సుప్రియ ఉన్ని నాయర్ ట్వీట్లో తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన 75 ఏళ్ల వయసుగల తల్లితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. తన తల్లి మధుమేహంతో బాధపడుతున్నందువల్ల ఓ వీల్ చైర్లో కూర్చుండబెట్టి తీసుకెళ్లాలని అనుకున్నట్లు తెలిపారు. విమానం వద్దకు వీల్చైర్ను తీసుకొచ్చిన తర్వాత పైలట్ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తల్లీకూతుళ్ళను ఒక రాత్రి జైలులో పెట్టిస్తానని బెదిరించారని పేర్కొన్నారు.
ఈ తెల్లవారుజామున ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక వివరణాత్మక ట్వీట్ లో, ఎంఎస్ నాయర్ జరిగిన సంఘటనను వివరించారు. ఈ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కెప్టెన్ తనను భయంకరమైన పరిణామాలకు గురి చేస్తానని బెదిరించాడని ఆమె అన్నారు. మేము వీల్ చైర్ సహాయం కోరినందున మమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు అని ఆమె పేర్కొన్నారు. మహిళను బెదిరించిన ఇండిగో విమానం పైలట్ను విధులకు దూరంగా ఉంచారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
[svt-event date=”14/01/2020,7:02PM” class=”svt-cd-green” ]
.@IndiGo6E Your captain on 6E 806 from Chennai to Bangalore on January 13 Jayakrishna harrased, threatened and prevented me and my 75-year old diabetic mom from disembarking the flight and threatened to arrest us because we asked for wheelchair assistance.
— Sun☀️Tweets (@SupriyaUnniNair) January 13, 2020
[/svt-event]