AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

ప్రస్తుతం కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వే శాఖ పలు స్పెషల్ ట్రైన్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక వీటి ఆక్యుపెన్సీపై దృష్టి సారించిన రైల్వేశాఖ త్వరలోనే డిమాండ్‌కు తగ్గట్టు...

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..
Ravi Kiran
|

Updated on: Jun 27, 2020 | 9:18 AM

Share

దేశంలో దశలవారీ లాక్‌డౌన్ ముగిసి అన్‌లాక్ ప్రక్రియ మొదలైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో స్పష్టం చేసినప్పటికీ ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజా రవాణా తిరిగి పున: ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ ఆగష్టు 12 వరకు సాధారణ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వే శాఖ పలు స్పెషల్ ట్రైన్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక వీటి ఆక్యుపెన్సీపై దృష్టి సారించిన రైల్వేశాఖ త్వరలోనే డిమాండ్‌కు తగ్గట్టు వీటితో పాటుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కీలక ప్రకటన చేసింది. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది.

Also Read:

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?