జమ్మూ కశ్మీర్లో.. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్!
భారతీయ రైల్వే ప్రస్తుతం ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకదాన్ని నిర్మించడంలో బిజీగా ఉంది. కాశ్మీర్ లో చెనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. రియాసి జిల్లాలోని కౌరి గ్రామంలో కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వంతెన చెనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పారిస్లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 30 […]
భారతీయ రైల్వే ప్రస్తుతం ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకదాన్ని నిర్మించడంలో బిజీగా ఉంది. కాశ్మీర్ లో చెనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. రియాసి జిల్లాలోని కౌరి గ్రామంలో కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వంతెన చెనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పారిస్లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు.
ఈ రైల్వే వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకు 1,400 మంది శ్రామికులు పనిచేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం 2004 లో ప్రారంభమైంది, కాని 2008-09లో ఈ ప్రాంతంలో తరచుగా అధిక వేగంగల గాలుల కారణంగా, ప్రయాణీకుల భద్రతా అంశం కారణంగా పనులు ఆగిపోయాయి. నిర్మాణంలో ఉన్న వంతెన 260 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదని, దాని ఆయుష్షు 120 సంవత్సరాలు ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
కాశ్మీర్ రైల్వే ప్రాజెక్టులోని ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా విభాగంలో భాగమైన కత్రా మరియు బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ వంతెన కీలకమైన లింక్.
[svt-event date=”13/01/2020,12:33AM” class=”svt-cd-green” ]
All Weather Rail Connectivity: Embarking on a dream project, Indian Railways is building world’s highest Rail bridge on River Chenab connecting Kashmir Valley.
An engineering marvel, it will facilitate trade & be a strategic asset for the Indian armed forces. pic.twitter.com/fUcNmoHaNY
— Piyush Goyal (@PiyushGoyal) January 11, 2020
[/svt-event]