నాసా స్పేస్ ఎక్స్ క్రూ-3 మిషన్ కి ఎంపికైన ఇండో-అమెరికన్ వ్యోమగామి రాజాచారి, వచ్చే ఏడాది రోదసి యానం
నాసా, యూరపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా చేపట్టనున్న స్పేస్ ఎక్స్ క్రూ - 3 మిషన్ కి ఇండో-అమెరికన్ రాజాచారి వ్యోమగామిగా ఎంపికయ్యారు.
నాసా, యూరపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా చేపట్టనున్న స్పేస్ ఎక్స్ క్రూ – 3 మిషన్ కి ఇండో-అమెరికన్ రాజాచారి వ్యోమగామిగా ఎంపికయ్యారు. వచ్ఛే ఏడాది ఈ మిషన్ ను ఈ సంస్థలు చేపట్టనున్నాయి. యూఎస్ ఎయిర్ ఫోర్స్ కల్నల్ గా పని చేస్తున్న రాజాచారితో బాటు కమాండర్ పైలట్ గా టోమ్ మార్ష్ బర్న్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఏస్ట్రోనట్ మథియాస్ మారర్ కూడా ఈ మిషన్ వ్యోమగాములుగా సెలెక్ట్ అయ్యారు. నాలుగో వ్యోమగామిని త్వరలో ఎంపిక చేయనున్నారు. రాజాచారికి ఇది మొట్టమొదటి స్పేస్ ఫ్లైట్..2017 లో ఆయన నాసా వ్యోమగామి అయ్యారు. తన కెరీర్ లో రెండున్నర వేల గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఆయనకు ఉంది. భవిష్యతులో నాసా చేపట్టబోయే చంద్రమండల యాత్రకు కూడా చారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
ఈ ముగ్గురు వ్యోమగాములూ అంతరిక్షంలో ఆరు నెలల పాటు ఉంటారు. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మిషన్ తొలి క్రూ వ్యోమగాములు ఉండగా ..క్రూ-2 వ్యోమగాములు త్వరలో వారిని కలుసుకోనున్నారు. తనను క్రూ-3 మిషన్ కి వ్యోమగామిగా ఎంపిక చేసినందుకు రాజాచారి హర్షం వ్యక్తం చేస్తున్నారు.