India tour of Australia: క్రికెట్ లవర్స్కు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు(సీఏ) గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 26-30 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులను అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది. రోజుకు 25 వేల మంది చొప్పున ఐదు రోజులకు గానూ మొత్తంగా లక్షా 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని అనుకుంటోందట. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.
ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్టేడియమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. అప్పటి కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోందని సమాచారం. కాగా, కోవిడ్- 19 కారణంగా ఇప్పటివరకు జరిగిన ఏ ఒక్క మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించలేదు. అంతేకాదు ఆటగాళ్లందరిని బయోబబుల్ వాతావరణంలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు.
Also Read:
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..