నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

నిరుద్యోగులకు ఇదే సరైన అవకాశం. వివిధ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3,517 పీవో పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీపీఎస్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..
Follow us

|

Updated on: Oct 27, 2020 | 3:56 PM

Good News To Un Employees: నిరుద్యోగులకు ఇదే సరైన అవకాశం. వివిధ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3,517 పీవో పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీపీఎస్( ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ప్రకటించింది. ఈ పోస్టులకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

కెనరా బ్యాంక్(2,100), యూకో బ్యాంక్(350), బ్యాంక్ ఆఫ్ ఇండియా(734), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(250), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్(83)లలో పోస్టుల్ని నియమించనుంది. ఈ పోస్టులకు సంబంధించి ఐబీపీఎస్ పీవో ప్రిలిమినరీ ఎగ్జామ్ 2021 జనవరి 5,6వ తేదీల్లో జరగనుండగా.. గత ఆగష్టు 5 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

వివరాలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 అక్టోబర్ 28

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2020 నవంబర్ 11

ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్: 2021 జనవరి 5 లేదా 6

విద్యార్హత: డిగ్రీ

వయస్సు: 20-30 ఏళ్లు

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు- రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ.175

పూర్తి వివరాల కోసం :  https://www.ibps.in/