India Tour Of Australia: ఆసీస్ టూర్కు సంబంధించి భారత జట్టు పర్యటన షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. నవంబర్ 27 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుండగా.. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ ఆస్ట్రేలియా టూర్కు సంబంధించి మూడు ఫార్మెట్లకు జట్లను ఎంపిక చేసింది. గాయం కారణంగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ ఇషాంత్ శర్మలకు రెస్ట్ ఇచ్చింది. ఇక షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
వన్డే సిరీస్:
టీ20 సిరీస్:
టెస్ట్ సిరీస్:
యూఏఈలో ఐపీఎల్ ముగిసిన అనంతరం నవంబర్ 12న భారత్ టీమ్ సరాసరి ఆస్ట్రేలియా పయనం కానుంది. సిడ్నీలో భారత జట్టు 14 రోజులు క్వారంటైన్లో ఉండటమే కాకుండా అక్కడే ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేయనుంది. దీని కోసం న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Also Read:
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..