AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.300కోట్ల నిజాం నిధులెవరికి..? వారసులకా..? పాకిస్తాన్‌కా..?

దేశ విభజన సమయంలో అసలేం జరిగింది..? ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. లండన్ నాట్ వెస్ట్ బ్యాంక్‌లో దాచిన 3వందల కోట్లకు వారసులెవరు..? నిజాం వారసులు, పాకిస్తాన్ మధ్య ఆస్తి తగాదాలేంటి..? గత ఏడు దశాబ్ధాలుగా దీనిపై విచారణ జరుపుతూ వస్తోన్న బ్రిటన్ కోర్టు దీనిపై ఏ తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 1947లో దేశ విభజన సందర్భంగా భారత్‌లో ఉండాలా..? లేక పాక్‌కు వెళ్లాలా అని తర్జనభర్జన పడ్డారు ఏడో నిజాం […]

రూ.300కోట్ల నిజాం నిధులెవరికి..? వారసులకా..? పాకిస్తాన్‌కా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2019 | 12:25 PM

Share

దేశ విభజన సమయంలో అసలేం జరిగింది..? ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. లండన్ నాట్ వెస్ట్ బ్యాంక్‌లో దాచిన 3వందల కోట్లకు వారసులెవరు..? నిజాం వారసులు, పాకిస్తాన్ మధ్య ఆస్తి తగాదాలేంటి..? గత ఏడు దశాబ్ధాలుగా దీనిపై విచారణ జరుపుతూ వస్తోన్న బ్రిటన్ కోర్టు దీనిపై ఏ తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

1947లో దేశ విభజన సందర్భంగా భారత్‌లో ఉండాలా..? లేక పాక్‌కు వెళ్లాలా అని తర్జనభర్జన పడ్డారు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ నేపథ్యంలో తన దగ్గరున్న సొమ్మును బ్రిటన్‌లోని పాక్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీమతుల్లా అకౌంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 1948లో 10లక్షల 7వేల 940రూపాలయను తన బ్యాంక్ ఖాతా నుంచి నాటి బ్రిటన్ హై కమిషనర్ పేరిట ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ డబ్బు ఇప్పుడు వడ్డీతో కలుపుకొని 3.5కోట్ల పౌండ్లు అంటే 309కోట్లకు చేరింది.

అయితే ఈ సొమ్ముపై హక్కు తమదని పాకిస్తాన్ వాదిస్తోంది. నాటి హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం దండెత్తిన సమయంలో నిజాం నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని.. అందుకు ప్రతిగా ఆయన తమకు ఆ నిధులు చెల్లించాడని పాక్ వాదిస్తోంది. అయితే ఈ వాదనను నిజాం వారసులు ఖండిస్తున్నారు. వారసులమైన తమకే ఈ డబ్బు చెందాలని 8వ నిజాం ముకరమ్‌ఝా, అతని తమ్ముడు ముఫక్కమ్ ఝా వాదిస్తున్నారు. అప్పటి నుంచి ఇరు పక్షాల మధ్య న్యాయ పోరాటం కొనసాగుతోంది.

కాగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ న్యాయ పోరాటంలో భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి కూడా ప్రతివాదులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల రెండు వారాల పాటు జరిగిన విచారణలో.. ఇరు పక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించి వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులో తుది తీర్పు త్వరలోనే వెలువడనుంది. మరి ఆ తీర్పు ఎవరికి అనుగుణంగా వస్తుందో చూడాలంటే ఆరు వారాలు ఆగాల్సిందే.