AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గిరిజ‌న గ్రామంలో పిల్ల‌లు మొద‌టిసారి పాఠ‌శాల‌ను చూశారు..

అది తెలంగాణ‌లోని నీలం తోగు అనే చిన్న గిరిజ‌న కుగ్రామం. అక్క‌డ గుత్తి కోయ గిరిజ‌నులు నివ‌శిస్తుంటారు. లాక్ డౌన్ కార‌ణంగా వారి బ్ర‌తుకుతెర‌వుకి భ‌రోసా లేకుండా పోయింది. పూట భోజ‌నానికి కూడా గ‌డ‌వని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఆ గిరిజ‌న గ్రామంలో పిల్ల‌లు మొద‌టిసారి పాఠ‌శాల‌ను చూశారు..
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2020 | 3:51 PM

Share

అది తెలంగాణ‌లోని నీలం తోగు అనే చిన్న గిరిజ‌న కుగ్రామం. అక్క‌డ గుత్తి కోయ గిరిజ‌నులు నివ‌శిస్తుంటారు. లాక్ డౌన్ కార‌ణంగా వారి బ్ర‌తుకుతెర‌వుకి భ‌రోసా లేకుండా పోయింది. పూట భోజ‌నానికి కూడా గ‌డ‌వని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో వారికి సాయం చేసేందుకు ఉస్మానియాలో యూనివ‌ర్సిటీలో సైబర్ లా చ‌దువుతోన్న‌ 25 ఏళ్ల ఎస్రామ్ సంతోష్ స్వెరో ముందుకొచ్చాడు. కొన్నినిత్యావ‌స‌రాలు అందించేందుకు అక్క‌డికి చేరుకున్నాడు. కానీ అక్క‌డికి వ‌చ్చాక అస‌లు స‌మ‌స్య తెలుసుకున్నాడు. అక్క‌డ పిల్ల‌లు అస‌లు స్కూల్, చదువ‌లు అనే వాటి గురించి తెలియ‌క‌పోవ‌డం గుర్తించి ఆశ్చ‌ర్య‌పోయాడు. దీంతో వెంట‌నే న‌డుం బిగించాడు. అతని స్నేహితులు వీరెల్లి షెషీందర్ రెడ్డి, గున్మంతరావు క‌లిసి భీమ్ హ్యాపీనెస్ సెంటర్‌ను ప్రారంభించి..గిరిజ‌న పిల్ల‌ల్ని చ‌దువులు వైపు మ‌ల్లించాడు. లాక్ డౌన్ సమయంలో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ కుగ్రామంలోని గిరిజన పిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించ‌డం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

గిరిజనులకు ఈ కలను నిజం చేయడం ఎస్రామ్‌కు అంత ఈజీ ప‌నేం కాదు. చివరి 30 రోజులుగా అత‌డు బైక్ పై 15 కిలోమీట‌ర్లు, కాలిన‌డ‌క‌న కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తున్నాడు. “ఇది చాలా కష్టమైన‌, కాని పిల్లలు కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డం చాలా విలువైన‌దిగా అనిపిస్తోంది” అని ఎస్రామ్ పేర్కొన్నారు. ఎస్రామ్, తన ఫ్రెండ్స్ తో కలిసి పిల్ల‌ల‌కు పుస్తకాల స్టేషనరీ, క్యాండిల్స్, బిస్కెట్స్, గుడ్లు స‌మ‌కూరుస్తున్నాడు.