ఫార్మా కంపెనీల్లో.. క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు.. కోతుల కొర‌త..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలోనూ

ఫార్మా కంపెనీల్లో.. క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు.. కోతుల కొర‌త..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 4:34 PM

Coronavirus vaccine: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలోనూ మ‌హ‌మ్మారికి టీకా కొనుగొనేందుకు జోరుగా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అయితే చైనా ప‌రిశోధ‌న‌శాల‌ల‌కు ఇప్పుడు ఓ కొర‌త ఏర్ప‌డింది. వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు చేప‌ట్టేందుకు కోతులు దొర‌క‌డం లేద‌ట‌. ఒక‌వేళ దొరికినా.. వాటి ఖ‌రీదు విప‌రీతంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ను మనుషుల మీద ప్ర‌యోగించడానికి ముందు.. కోతులపై ప‌రీక్ష చేయ‌నున్నారు.

కాగా.. పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. ఎలుక‌లు, కుందేళ్ల‌పై ఇప్ప‌టికే ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌లు ముగిశాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌ను కోతుల‌పై ప‌రీక్షించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. యిషెంగ్ అనేక ఫార్మా కంపెనీ భారీ స్థాయిలో వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు మొద‌లుపెట్టింది. సెప్టెంబ‌ర్‌లోగా వ్యాక్సిన్ తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే కోతుల‌పై ప్ర‌యోగం జ‌ర‌గాల్సి ఉంద‌ని, కానీ వాటి ఖ‌రీదు విప‌రీతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా రీసెస్ జాతికి చెంది కోతులు ప‌దివేల యువాన్ల‌కు దొరికేవి. ఇప్పుడు వాటి ఖ‌రీదు ల‌క్ష యువాన్ల‌కు చేరిన‌ట్లు యిషెంగ్ కంపెనీ పేర్కొన్న‌ది.