మోదీని భయపెట్టే సుమిత్రా మహాజన్
తనకు సంబంధించిన ఏ విషయంలోనైనా మందలించగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి సుమిత్రా మహాజన్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఇండోర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘లోక్సభ స్పీకర్గా తాయి(సుమిత్రా మహాజన్) తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ప్రజలలో ఆమె పట్ల మంచి అభిప్రాయం ఉంది. మీ అందరికి నేను ఈ దేశ ప్రధానిగానే తెలుసు. కానీ బీజేపీలో నన్ను మందలించగల ఏకైక వ్యక్తి […]
తనకు సంబంధించిన ఏ విషయంలోనైనా మందలించగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి సుమిత్రా మహాజన్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఇండోర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘లోక్సభ స్పీకర్గా తాయి(సుమిత్రా మహాజన్) తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ప్రజలలో ఆమె పట్ల మంచి అభిప్రాయం ఉంది. మీ అందరికి నేను ఈ దేశ ప్రధానిగానే తెలుసు. కానీ బీజేపీలో నన్ను మందలించగల ఏకైక వ్యక్తి తాయి మాత్రమే అని’’ చెప్పారు. అంతేకాకుండా బీజేపీ కోసం తామిద్దరం కలిసి పనిచేశామని.. పని పట్ల ఆమెకు చాలా శ్రద్ధ ఉందంటూ కొనియాడారు. ఇండోర్ అభివృద్ధికి ఆమె చాలా కృషి చేశారని పేర్కొన్నారు.