గుంటూరులో దారుణం.. మహిళపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక లైంగికదాడి

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త,స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు నగరంపాలెంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

గుంటూరులో దారుణం.. మహిళపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక లైంగికదాడి
Follow us

|

Updated on: Dec 20, 2020 | 2:18 PM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త,స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు నగరంపాలెంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రతిఘటించిన ఆ మహిళను హింసిస్తూ కిరాతకాన్ని ప్రదర్శించారు దుర్మార్గులు. భర్త, అతని స్నేహితులతో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ ఓ గృహిణి గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళతో బెంగళూరుకు చెందిన వ్యక్తికి ఏడేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అయితే, కొద్దిరోజుల కిందట అతను గుంటూరు వచ్చినట్లు తెలుసుకున్న సదరు మహిళ బంధువులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అతనితో మాట్లాడే క్రమంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తనపై దాడిచేశారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే, ఈనెల 17న సదరు మహిళ కాపురానికి తీసుకు వెళ్లాలని అడగడానికి తన భర్త వద్దకు వెళ్లగా అక్కడ మద్యం తాగుతున్న భర్త, అతని స్నేహితులతో కలిసి సామూహికంగా తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుంటూరు నగరంపాలెం పోలీసులు తెలిపారు