అయోధ్యకు ఉగ్రముప్పు.. నిఘా వర్గాల హెచ్చరిక
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగారాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు అయోధ్యలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదనపు బలగాలను మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆలయ పరిసరాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద రామజన్మభూమి పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరించారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగారాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు అయోధ్యలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదనపు బలగాలను మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఆలయ పరిసరాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద రామజన్మభూమి పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరించారు.