ఎండ తీవ్రతను తట్టుకోలేక హీరో జాన్‌ అబ్రహాం ఏం చేశాడంటే..!

2016 సంవత్సరంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఢిషూం’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఏకంగా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం రిలీజ్అయ్యి బుధవారానికి నాలుగేళ్లయిన సందర్భంగా సినిమా హీరోల్లో ఒకరైన వరుణ్‌ ధావన్‌ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేశారు.

ఎండ తీవ్రతను తట్టుకోలేక హీరో జాన్‌ అబ్రహాం ఏం చేశాడంటే..!
Follow us

|

Updated on: Jul 31, 2020 | 12:37 AM

2016 సంవత్సరంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఢిషూం’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఏకంగా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం రిలీజ్అయ్యి బుధవారానికి నాలుగేళ్లయిన సందర్భంగా సినిమా హీరోల్లో ఒకరైన వరుణ్‌ ధావన్‌ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ నమ్మలేని సంఘటనను కూడా అతను బయటపెట్టాడు. ఈ సినిమాలో కొంత భాగాన్ని అబుదబీలోని ఎడారిలో చిత్రీకరించాట. అయితే, అక్కడి ఎండల తీవ్రతను తట్టుకోలేక మరో హీరో జాన్‌ అబ్రహాం పుచ్చకాయలను ఎక్కువగా తీసుకున్నాడట. అది కూడా ఒకటో, రెండో కాదట.. జాన్‌ ఒక్క రోజులో మొత్తం 21 పుచ్చకాయలను ఆరగించేశాడని వరుణ్‌ గుర్తుచేసుకున్నాడు.

జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయికగా రూ.45 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి వరుణ్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం వహించారు. తను పనిచేసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటని, తన ఇద్దరు సోదరులు తనకు ఎప్పుడూ అండగా ఉంటారని జూనియర్‌ ధావన్‌ అన్నాడు. అంతేకాకుండా మరోసారి తమ బృందం ఒకచోట చేరే సమయం రావచ్చని… ఢిషూం సీక్వెల్‌ వచ్చే అవకాశాన్ని వరుణ్‌ ధావన్‌ సూచనప్రాయంగా తెలిపారు