AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిందని.. ఆశ్రమాన్నే కూల్చేశారు..!

రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంగా ఉందని యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమంతోపాటు అందులోని రాధాకృష్ణ జగన్నాథ మందిరాలను కూడా నేలమట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీజీపీ, ఆరెస్సెస్ వంటి హిందూ ధార్మిక సంఘాలు ఆ చుట్టుపక్కలకు రాకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుతో పాటు నలువైపులా నుంచి వచ్చే రహదారులను […]

రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిందని.. ఆశ్రమాన్నే కూల్చేశారు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 25, 2019 | 10:52 AM

Share

రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంగా ఉందని యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమంతోపాటు అందులోని రాధాకృష్ణ జగన్నాథ మందిరాలను కూడా నేలమట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీజీపీ, ఆరెస్సెస్ వంటి హిందూ ధార్మిక సంఘాలు ఆ చుట్టుపక్కలకు రాకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుతో పాటు నలువైపులా నుంచి వచ్చే రహదారులను కలుపుతూ ఆరు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంతో అడ్డువచ్చిన ఇళ్లు, షాపులను నేలమట్టం చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారం అందిస్తోంది.

కాగా, ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ అనే వ్యక్తి 1995లో భూమిని కొనుగోలు చేసి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ఇక్కడ నిత్యం అఖండ హరినామ సంకీర్తనలు జరుగుతుంటాయి. యాదాద్రి అభివృద్దిలో భాగంగా చేపట్టిన రీజనల్ రోడ్డు నిర్మాణానికి హరే రామ హరే కృష్ణ ఆశ్రమం అడ్డువస్తోంది. ఈ స్థల అప్పగింత విషయంలో రెవెన్యూ అధికారులు, ప్రభూజీ మధ్య వివాదం నడుస్తోంది. కాగా, కోటి రూపాయల నష్టపరిహారం మంజూరు చేసినప్పటికీ ప్రభూజీ తిరస్కరించారని.. దీంతో ఆ పరిహారాన్ని భూ సేకరణ అథారిటీ కోర్టులో జమచేసి.. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డీవో అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తులు దీనిపై స్పందించలేదు. అందుకే అధికారుల ఆదేశాల ప్రకారం ఆశ్రమాన్ని నేటమట్టం చేశామని ఆర్డీవో తెలిపారు. ఇక ఆశ్రమంలోని కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామాగ్రిని యాదాద్రి దేవస్థానికి తరలించారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం