భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటే.. మసూద్ ను అప్పగించండి : సుష్మా
న్యూఢిల్లీ : పాకిస్థాన్ తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మరోసారి మండిపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో ఇమ్రాన్ ఖాన్ నిజంగా సత్సంబంధాలు కోరుకుంటే ముందుగా మసూద్ అజర్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.మసూద్ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్కు సుష్మా చురకలంటించారు. ఇమ్రాన్కు అంత పెద్ద మనుసుంటే… మసూద్పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. #WATCH EAM Sushma […]
న్యూఢిల్లీ : పాకిస్థాన్ తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మరోసారి మండిపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో ఇమ్రాన్ ఖాన్ నిజంగా సత్సంబంధాలు కోరుకుంటే ముందుగా మసూద్ అజర్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.మసూద్ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్కు సుష్మా చురకలంటించారు. ఇమ్రాన్కు అంత పెద్ద మనుసుంటే… మసూద్పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
#WATCH EAM Sushma Swaraj in Delhi: We are ready to engage with Pakistan in atmosphere free from terror. Some people say Imran Khan is a statesman, if he is so generous then he should hand over JeM chief Masood Azhar to India. Let’s see how generous he is. (13.03) pic.twitter.com/kgnDfv8gOY
— ANI (@ANI) March 14, 2019
మరోవైపు ఇప్పటికే మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్ను చైనా మరోసారి అడ్డుపుల్ల వేసింది.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. కాగా మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులుకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం చెబుతోంది.