AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12కి పెరిగిన కెమికల్ గొడౌన్ పేలుడు మృతులు

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ కెమికల్ గొడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 12కి పెరిగింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగర శివారులో ఉన్న పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గొడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. దీంతో పైకప్పు కుప్పకూలిపోవడంతో పాటు భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే 26 అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటీన ఘటనా […]

12కి పెరిగిన కెమికల్ గొడౌన్ పేలుడు మృతులు
Venkata Narayana
|

Updated on: Nov 05, 2020 | 10:12 AM

Share

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ కెమికల్ గొడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 12కి పెరిగింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగర శివారులో ఉన్న పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గొడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. దీంతో పైకప్పు కుప్పకూలిపోవడంతో పాటు భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే 26 అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పదిగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం నుంచి 14 మందిని రక్షించి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.