20 కోట్ల మంది మహిళల జన్ధన్ ఖాతాల్లోకి ఈ ప్రాతిపదికన డబ్బు జమ…
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో దేశంలో గడ్డు పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు పడే ఇబ్బందులను తగ్గించాలన్న సంకల్పంతో రాబోయే మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్ధన్ ఖాతాల్లోకి నెలకు రూ.500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కారక్రమంలో భాగంగా.. తొలి విడతలో భాగంగా 20 కోట్ల మంది మహిళల జన్ధన్ ఖాతాల్లోకి రూ.500లను ప్రభుత్వం ట్రాన్ఫర్ చేసిందని […]
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో దేశంలో గడ్డు పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు పడే ఇబ్బందులను తగ్గించాలన్న సంకల్పంతో రాబోయే మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్ధన్ ఖాతాల్లోకి నెలకు రూ.500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కారక్రమంలో భాగంగా.. తొలి విడతలో భాగంగా 20 కోట్ల మంది మహిళల జన్ధన్ ఖాతాల్లోకి రూ.500లను ప్రభుత్వం ట్రాన్ఫర్ చేసిందని అధికారులు తెలిపారు. ప్రతి ఖాతాదారుని అకౌంట్ లో డబ్బు జమైందని, ప్రజలు భౌతిక దూరం పాటించి..డబ్బు విత్ డ్రా చేసుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ క్రమంలో లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఏప్రిల్ నెలలో అన్ని బ్యాంకులకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది.
కాగా జన్ధన్ ఖాతాల్లో లబ్ధిదారుని అకౌంట్ చివరి అంకె ఆధారంగా డబ్బు ముందు జమ అవుతుంది. 0 లేదా 1తో ముగిసిన అకౌంట్ హోల్డర్స్ కి ఏప్రిల్ 3న, 2 లేదా 3తో ముగిసిన ఖాతాదారులకు ఏప్రిల్ 4న, 4లేదా 5 తో ముగిస్తే (ఏప్రిల్7), 8లేదా9 ఎండ్ అయితే (ఏప్రిల్9) ఖాతాల్లో డబ్బు క్రెడిట్ అవుతుందని తెలిపారు. మరో రెండు విడతల్లో మే, జూన్ నెలల్లో డబ్బు అకౌంట్స్ లో వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.