Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ గోల్డ్ కేసు: ఎన్ఐఏ అదుపులో కస్టమ్స్ జాయింట్ కమిషనర్

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బంగారు అక్రమ రవాణా కేసులో ఆరోపణలు రావడంతో కస్టమ్స్ జాయింట్ కమిషనర్ అనీష్ రాజన్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు నాగ్‌పూర్‌కు తరలించారు. కేరళలో అధికార పార్టీ సిపిఎంతో లింకులు ఉన్నాయని, అనీష్ ఈ కేసు నుండి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రక్షించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు..

కేరళ గోల్డ్ కేసు: ఎన్ఐఏ అదుపులో  కస్టమ్స్ జాయింట్ కమిషనర్
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 31, 2020 | 6:13 AM

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బంగారు అక్రమ రవాణా కేసులో ఆరోపణలు రావడంతో కస్టమ్స్ జాయింట్ కమిషనర్ అనీష్ రాజన్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు నాగ్‌పూర్‌కు తరలించారు. కేరళలో అధికార పార్టీ సిపిఎంతో లింకులు ఉన్నాయని, అనీష్ ఈ కేసు నుండి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రక్షించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు..

తిరువనంతపురం విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్న తరువాత, చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుండి కస్టమ్స్ కార్యాలయానికి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని అనిష్ రాజన్ మీడియాతో చెప్పారు. ఈ కేసులో సీఎంవో తో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పే విధంగా ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన ఎన్ఐఏ అధికారులు అనీష్ ను కూడా విచారించాలని భావించింది. దీంతో అయన్ను అదుపులోకి తీసుకున్నారు.

అనీష్ రాజన్ అన్నయ్య సిపిఎం కౌన్సిలర్ గా ఉన్నారు. అనీష్ ఇటీవల చేసిన ఫేస్ బుక్ పోస్ట్ కూడా వివాదానికి దారితీసింది. ఉన్నత పదవిలో పనిచేసే ఐఆర్ఎస్ అధికారి సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్ట్ చేయకూడదు. అయితే, అంతకు ముందు కూడా అనీష్ ఇలాంటి తప్పులు చేశాడని కేరళ ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు చేశాయి. అనీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతని అదపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.