AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ.. మరి మోదీ నిర్ణయమేంటి సారూ.?

భారత కరెన్సీ‌ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం మంచిదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఇండోనేషియా డబ్బు నోట్లపై గణేషుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా‌లో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ గురించి ప్రసంగించిన స్వామి.. అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుని బొమ్మ గురించి విలేకర్లు ప్రస్తావించగా స్వామి మాట్లాడుతూ… […]

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ.. మరి మోదీ నిర్ణయమేంటి సారూ.?
Ravi Kiran
|

Updated on: Jan 17, 2020 | 6:35 AM

Share

భారత కరెన్సీ‌ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం మంచిదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఇండోనేషియా డబ్బు నోట్లపై గణేషుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా‌లో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ గురించి ప్రసంగించిన స్వామి.. అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుని బొమ్మ గురించి విలేకర్లు ప్రస్తావించగా స్వామి మాట్లాడుతూ… ‘ఈ ప్రశ్నకు సమాధానం ప్రధాని మోదీ చెప్పాలన్నారు. డబ్బు నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడానికి తాను అనుకూలంగా ఉన్నానన్నారు. గణేషుడు విఘ్నాలను తొలగిస్తే.. లక్ష్మీదేవి డబ్బును వృద్ధి చేస్తుందన్నారు. ఇక దీని‌ గురించి ఎవరూ కూడా చెడుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు’. చూడాలి మరి దీనికి ప్రధాని మోదీ ఏం సమాధానం ఇస్తారో.?