AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్ఎంసీ ఎన్నికలు : వికలాంగులు, వృద్దులు, కోవిడ్ పేషెంట్ల కోసం ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

కోవిడ్  నేపథ్యంలో  జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణను సవాల్‌కు తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు : వికలాంగులు, వృద్దులు, కోవిడ్ పేషెంట్ల కోసం ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం
Ram Naramaneni
|

Updated on: Nov 22, 2020 | 2:28 PM

Share

కోవిడ్  నేపథ్యంలో  జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణను సవాల్‌కు తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లుంది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు కలిగిన  వికలాంగులకు, 80 ఏళ్లు పైబడినవారు, కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్లకు ఈ సారి  ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం  కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.  ఒకవేళ వికలాంగులు, వృద్దులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వెయ్యాలని భావిస్తే..వారి కోసం ప్రత్యేక ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా నియమించాలని చెప్పింది. ఇక వికలాంగులు, వయస్సు  పైబడినవారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేసే సౌలభ్యాన్ని కల్పించింది.

ఇక  కోవిడ్ 19 పేషెంట్లు కూడా మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్