AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

ఇసుక పాలసీని రూపొందించే విషయంలో ఏపీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఇసుక పాలసీలో పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగానే పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంటి అవసరాలు, పునరావాస నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుక సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత కొద్దిరోజులుగా ఇసుక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు రావాడంతో ఈ మార్పులు చేసింది. అంతేకాకుండా బలహీన వర్గాలకు […]

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
Ravi Kiran
|

Updated on: Jun 26, 2020 | 7:20 AM

Share

ఇసుక పాలసీని రూపొందించే విషయంలో ఏపీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఇసుక పాలసీలో పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగానే పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంటి అవసరాలు, పునరావాస నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుక సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత కొద్దిరోజులుగా ఇసుక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు రావాడంతో ఈ మార్పులు చేసింది.

అంతేకాకుండా బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా పర్మిట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది. హౌసింగ్ స్కీమ్, ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గృహ నిర్మాణాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలను చేసింది. కాగా, వంకలు, వాగులు, యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు పేదలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం వారు ముందుగా సచివాలయ అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది.