AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా హైరిస్క్‌ జోన్‌గా పారిస్!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో క‌రోనా మహమ్మారి క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న దేశ రాజధాని పారీస్‌, రెండో అతిపెద్ద సిటీ మార్సెయిల్‌ను

కరోనా హైరిస్క్‌ జోన్‌గా పారిస్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2020 | 8:34 PM

Share

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో క‌రోనా మహమ్మారి క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న దేశ రాజధాని పారీస్‌, రెండో అతిపెద్ద సిటీ మార్సెయిల్‌ను ఫ్రెంచ్‌ ప్రభుత్వం హై-రిస్క్‌జోన్లుగా ప్రకటించింది. ఈ రెండు నగరాల్లో వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. వరుసగా మూడో రోజూ కొత్తగా 2,500కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా విజృంభిస్తున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు తాజా ప్రకటన అధికారులకు వీలుకల్పిస్తుంది.

కాగా.. కరోనా కట్టడికోసం ఫ్రాన్స్ ప్రభుత్వం హైరిస్క్‌ జోన్లలో ప్రజా రవాణా, రద్దీని తగ్గించడం, రెస్టారెంట్లు, బార్లను మూసివేయడం, స్థానికులను నిర్బంధించడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించాలని భావిస్తున్నది. ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 2,12,211 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 30,406 మంది చనిపోయారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 97,957 యాక్టివ్‌ కేసులున్నాయి.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!