AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రానికి చెప్పకుండా ఎలా చేస్తారు? : మాజీ మంత్రి దేవినేని

పోలవరం సెగలు కక్కుతోంది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. కేంద్రానికి చెప్పకుండా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం టెండర్ల వ్యవహారంపై కేంద్రమంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సెర్బియా కేసుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ఉమా ఎద్దేవా […]

కేంద్రానికి చెప్పకుండా ఎలా చేస్తారు? : మాజీ మంత్రి దేవినేని
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2019 | 9:07 AM

Share

పోలవరం సెగలు కక్కుతోంది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. కేంద్రానికి చెప్పకుండా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం టెండర్ల వ్యవహారంపై కేంద్రమంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సెర్బియా కేసుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ఉమా ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ తన స్వార్ధం కోసమే నిలిపివేస్తుందని మండిపడ్డారు.