AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 13 ఇళ్లు దగ్ధం

కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కమ్మనమొలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 13 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని లంకె గోపాలస్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సుమారు 5 గ్యాస్ సిలెండర్లు పేలినట్లు సమాచారం. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇన్ని రోజులుగా తాము పడిన కష్టం వృధా అయిందని.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి ఫైర్ […]

కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 13 ఇళ్లు దగ్ధం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 12:26 PM

Share

కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కమ్మనమొలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 13 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని లంకె గోపాలస్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సుమారు 5 గ్యాస్ సిలెండర్లు పేలినట్లు సమాచారం. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇన్ని రోజులుగా తాము పడిన కష్టం వృధా అయిందని.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్లు అందుబాటులో లేకపోవడంతో మరింత నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.