AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది రైతు దినోత్సవం, అన్నదాతల ఆందోళన ముగియవచ్ఛు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్, పట్టు వీడని రైతాంగం

బుధవారం రైతు దినోత్సవమని, ఇన్ని రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన ముగియవచ్చునని ఆశిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఇది రైతు దినోత్సవం, అన్నదాతల ఆందోళన ముగియవచ్ఛు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్, పట్టు వీడని రైతాంగం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 23, 2020 | 10:22 AM

Share

బుధవారం రైతు దినోత్సవమని, ఇన్ని రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన ముగియవచ్చునని ఆశిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని గ్రీట్ చేస్తూ ఆయన.. ఈ దేశానికి వారు ఆహారాన్ని, భద్రతను ఇస్తున్నారని, ప్రభుత్వం వారి డిమాండ్ల విషయంలో పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని అన్నారు. రైతుల విషయంలో ప్రధాని మోదీ… మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ను ఆదర్శంగా తీసుకున్నారని, అన్నదాతల మేలుకోసం కృషి చేస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని కూడా రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఇలా ఉండగా రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. యూపీలో పిలిభిత్, మొరాదాబాద్ లలో నిన్నఅన్నదాతలపై పోలీసుల చర్యను నిరసిస్తూ సింఘు బోర్డర్ లో వారు నిరసనను ఉధృతం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను తగులబెడతామని హెచ్చరించారు. అటు-మొరాదాబాద్ లో 8 గంటల అనంతరం టోల్ ప్లాజాను రైతులు ‘విముక్తం’ చేశారు. ఇన్ని గంటలపాటు వారు దీన్ని  తమ ‘అధీనంలో’ ఉంచుకున్నారు.