AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు చర్చల్లో పురోగతి.. వ్యవసాయ చట్టాలపై రైతులముందు కొత్త ప్రతిపాదన.. సమస్య పరిష్కారానికి మరో కమిటీ

ఏడాదిన్నర వరకు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని రైతులకు హామీ ఇచ్చింది.

రైతు చర్చల్లో పురోగతి.. వ్యవసాయ చట్టాలపై రైతులముందు కొత్త ప్రతిపాదన.. సమస్య పరిష్కారానికి మరో కమిటీ
Balaraju Goud
|

Updated on: Jan 20, 2021 | 8:59 PM

Share

కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చల్లో పురోగతి లభించింది. కేంద్రం రైతు సంఘాల ముందు ఓ ప్రతిపాదన పెట్టింది. కేంద్రం కాస్త మెట్టుదిగింది. ఏడాదిన్నర వరకు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులతో కమిటీ వేస్తామని.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కేంద్రం ప్రతిపాదనపై ఎల్లుండి జరిగి చర్చల్లో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు.

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టాలపై ముందుకెళ్తామని ప్రకటించింది. చట్టాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేస్తామని హామీ ఇచ్చింది. కనీస మద్దతుధరపై కమిటీ వేస్తామని ఆఫర్‌ ఇచ్చింది. కేంద్రం ప్రతిపాదన రేపు చర్చిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. ఎల్లుండి జరిగే చర్చల్లో తమ అభిప్రాయాన్ని కేంద్రానికి వెల్లడిస్తామని తెలిపాయి. ఈనెల 22వ తేదీన కచ్చితంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు.

రైతులతో కేంద్రం 10 సార్లు సమావేశమయ్యింది. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌ , పీయూష్‌ గోయెల్‌ చర్చల్లో పాల్గొన్నారు. మరోవైపు రిపబ్లిక్‌డే నాడు ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ర్యాలీకి అనుమతిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Also… కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..? నిరుద్యోగులకు ఉపశమనం దొరికేనా..?

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?