పుల్వామాలో మళ్ళీ కాల్పుల మోత‌!

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణ పరిధిలోని బ్రాబందిన ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం సాయుధ జవాన్లు స్థానిక జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలింపు చ‌ర్యలు చేపట్టారు. ఆర్మీ జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తేలలేదు. గత వారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ […]

పుల్వామాలో మళ్ళీ కాల్పుల మోత‌!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 11:28 AM

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణ పరిధిలోని బ్రాబందిన ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం సాయుధ జవాన్లు స్థానిక జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలింపు చ‌ర్యలు చేపట్టారు. ఆర్మీ జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తేలలేదు. గత వారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ క్రమంలో మరోసారి పుల్వామాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.