మోగిన గ్రేటర్ నగారా… ఎన్నికల మార్గదర్శకాలు.. పాటించవల్సిన నియమాలు
గ్రేటర్ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్ కేంద్రానికి వచ్చేవారు శానిటైజ్ చేసుకోవడంతో పాటు, ఫేస్ మాస్క్ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది...

GHMC Election Guidelines : గ్రేటర్ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్ కేంద్రానికి వచ్చేవారు శానిటైజ్ చేసుకోవడంతో పాటు, ఫేస్ మాస్క్ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. వీటితో పాటు ఇతర మార్గదర్శకాలను విడుదల చేసింది.
నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతిన వాహనాల సంఖ్య రెండుకు పరిమితం చేసినట్లుగా తెలిపారు. భద్రతా సిబ్బంది మినహా ఐదుగురి సభ్యుల బృందానికి మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతి ఇస్తున్నారు.
ప్రచార కాన్వాయ్లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండటంతోపాటు పార్టీల అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అర్థగంట విరామం తప్పనిసరి అని వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు. జీహెచ్ఎంసీ, సర్కిల్, వార్డుల వారీగా నోడల్ హెల్త్ అధికారుల నియామకం చేసినట్లుగా పేర్కొన్నారు.
ఎన్నికల సిబ్బందికి పెద్ద హాల్స్లో శిక్షణ. వర్చువల్ ట్రైనింగ్ను ఉపయోగించుకోవచ్చు. సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి బదులుగా మరొకరిని వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు, కమిషనర్, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి అని సూచించారు.
దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇక ఒక కౌంటింగ్ హాల్లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉండకూడదు అని స్పష్టం చేశారు.
