Telangana DGP: మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు.. ఖమ్మంలో పర్యటించిన డీజీపీ

లాకప్​ డెత్​కు గురైన మరియమ్మకు న్యాయం జరిగేలా చూస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Telangana DGP: మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు.. ఖమ్మంలో పర్యటించిన డీజీపీ
Telangana Dgp
Follow us

|

Updated on: Jun 27, 2021 | 1:28 PM

లాకప్​ డెత్​కు గురైన మరియమ్మకు న్యాయం జరిగేలా చూస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన.. మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ సంఘటన దురదృష్టకరమన్నారు డీజీపీ. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి.. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని డీజీపీ కలిశారు. అతని ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మరియమ్మ కుటుంబ సభ్యులతో ఆమె మృతి గురించి మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబాని తగిన సాయాన్ని ప్రకటించిందన్నారు డీజీపీ. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో మరియమ్మ ఘటన జరగడం దురదుష్టకరమని చెప్పారు.

“మరియమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటాం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగక్కుండా చూస్తాం. నేరాలను నిరోదించే క్రమంలో ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయకుండా పోలీసులు విచారణ జరపాలి” అని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈనెల 18న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్​లో మరియమ్మ మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగు పోలీసు అధికారులపై వేటు పడింది. మరియమ్మ లాకప్‌డెత్‌పై విపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌ బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కేసీఆర్‌… దళితులపై చేయిపడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం… లాకప్‌డెత్‌ పూర్వాపరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో ఆయ‌న నేడు ఖ‌మ్మంలో ప‌ర్య‌టించారు.

Also Read: తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు.. బాధితుడి ప్రైమ‌రి కాంటాక్ట్స్ అయిన 16 మంది నుంచి శాంపిల్స్ సేక‌ర‌ణ

జూలై 1 నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీస్‌లు పెంపు.. ఇవిగో వివ‌రాలు

Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో