Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

దేశ రాజధాని ఢిల్లీ కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్..

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 21, 2020 | 7:37 AM

Delhi Government: దేశ రాజధాని ఢిల్లీ కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాస్క్ ధరించకుండా బయటకొచ్చిన వారికి రూ. 2 వేలు జరిమానా విధిస్తూ కీలక ననిర్ణయం తీసుకుంది.

అంతేకాదు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతిక దూరాన్ని పాటించకపోయినా రూ. 2 వేలు భారీ జరిమానాను విధిస్తామని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, గతంలో ఈ జరిమానా రూ. 500 ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం తాజాగా ఢిల్లీలో మరో 6608 పాజిటివ్ కేసులు, 118 మరణాలు సంభవించాయి. దీనితో అక్కడ కరోనా కేసుల సంఖ్య  5.17 లక్షలకు చేరింది.

Also Read: మత్స్యకారులకు గుడ్ న్యూస్.. నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్..