కాలుష్యానికి చెక్, కొత్త పరిశ్రమలకు నో పర్మిషన్, అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇక కొత్త పరిశ్రమలకు వేటికీ అనుమతి లభించే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. కేవలం సర్వీస్ ఇండస్ట్రీ, హైటెక్ ఇండస్ట్రీలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఆయన చెప్పారు. తమ నగర ఎకానమీ..సర్వీసుపై ఆధారపడినదే తప్ప ఉత్పాదక రంగంపై ఆధారపడినది కాదని ఆయన అన్నారు. ఐటీ, మీడియా, కాల్ సెంటర్స్, టీవీ, వీడియో ప్రొడక్షన్ హౌసెస్, హెచ్ […]
ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇక కొత్త పరిశ్రమలకు వేటికీ అనుమతి లభించే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. కేవలం సర్వీస్ ఇండస్ట్రీ, హైటెక్ ఇండస్ట్రీలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఆయన చెప్పారు. తమ నగర ఎకానమీ..సర్వీసుపై ఆధారపడినదే తప్ప ఉత్పాదక రంగంపై ఆధారపడినది కాదని ఆయన అన్నారు. ఐటీ, మీడియా, కాల్ సెంటర్స్, టీవీ, వీడియో ప్రొడక్షన్ హౌసెస్, హెచ్ ఆర్ సర్వీస్, ప్లేస్ మెంట్ ఏజెన్సీలతో బాటు లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు ఇక ఢిల్లీలో తమ అఫీసులను ప్రారంభించవచ్ఛు అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు వీళ్లంతా ఢిల్లీ శివార్లలోని నోయిడా, గుర్ గావ్ వంటి చోట్ల తమ కార్యాలయాలలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.