AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌…

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తోంది. అధికార వైసీపీ నేతలే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. రైతుల పేరిట బినామీ పేర్లతో ధాన్యం విక్రయాలు సాగించిందని టీడీపీ అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.

ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌...
Sanjay Kasula
|

Updated on: Nov 09, 2020 | 10:14 PM

Share

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తోంది. అధికార వైసీపీ నేతలే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. రైతుల పేరిట బినామీ పేర్లతో ధాన్యం విక్రయాలు సాగించిందని టీడీపీ అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో నెల్లూరులో ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు.. రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఇటీవల మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన ఆరోపణలను వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇటీవల సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన జైపాల్‌ అనే వ్యక్తి… దళారులు పేరిట ధాన్యం విక్రయాలు చేశారని వైసీపీ అంటోంది. భారీగా నగదును కూడా అకౌంట్లలో జమచేశారని ఆరోపిస్తూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని ఆ పార్టీ నేతలు సమర్పించారు. దాంతో ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

తాజాగా పోలీసులు జైపాల్‌తో పాటు టీడీపీకి చెందిన మధుసూదన్‌ వంటి మరికొందరి నేతలపై కేసులు నమోదు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారంలో అసలేం జరిగిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌ పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్‌ టూ ఫేస్‌.