AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను పెంచి పోషిస్తున్న.. వాయు కాలుష్యం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఇటలీ రీసెర్చర్లు కొత్త విషయాన్ని కనుగొన్నారు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు

కరోనాను పెంచి పోషిస్తున్న.. వాయు కాలుష్యం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2020 | 3:32 PM

Share

Air Pollution Particles : కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఇటలీ రీసెర్చర్లు కొత్త విషయాన్ని కనుగొన్నారు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. ఇటలీలోని పల్లె పరిసరాలు, పరిశ్రమ వాతావరణాల్లోని శాంపుల్స్ సేకరించారు. కాలుష్యంలో చాలా కాలం పాటు సజీవంగా ఉంటున్న వైరస్ మనుషులకు కచ్చితంగా హాని చేయగలదని నిరూపించలేపోయారు.

కాగా.. యూనివర్సిటీ ఆఫ్ బొలొగ్నాకు చెందిన లియోనర్డో అనే రీసెర్చర్ కాలుష్య కారకాలపై సర్వే చేశారు. ‘నేనొక సైంటిస్టుని. నాకు కూడా తెలియడం లేదంటే బాధగా ఉంది. దాని గురించి సొల్యూషన్ కూడా వెదకొచ్చు. ఇలా తెలియనంత కాలం జరుగుతున్న పరిణామాల కారణంగా అనుభవిస్తూనే ఉండాలి’ అని అన్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పొల్యూషన్ ఉండటం గమనించారు. పైగా అక్కడ పరిసర ప్రదేశాల వారికే కరోనా పాజిటివ్ ఎక్కువగా నమోదయ్యాయి. దీనిని బట్టే ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలు కరోనాను ఎక్కువగా వ్యాప్తి చేయగలవని అర్థమవుతోంది.

మరోవైపు.. కరోనా ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు బయటికొచ్చే నీటి తుంపర్లు వాతావరణంలో కలిసిపోతాయి. బ్యాక్ గ్రౌండ్ లో కాలుష్య కారకాలతో కలిసి ప్రయాణిస్తాయని బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జొనాథన్ రీడ్ అన్నారు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీ వైరస్ గాల్లో మూడు గంటల పాటు ఉంటుందని.. ఎవరైనా దగ్గులు, తుమ్ములు నేరుగా వదిలితే వాటి తుంపర్లు గాల్లో ప్రయాణిస్తూనే ఉంటాయని చెప్పింది. ప్లాస్టిక్, స్టీల్ వంటి వాటిపై 2 నుంచి 3 రోజుల వరకూ సజీవంగా ఉంటుందని వెల్లడించింది.