AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

Coronavirus: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించడంతో జగన్ సర్కార్ హై అలెర్ట్ ప్రకటించింది.ఈ మేరకు విశాఖలోని కృష్ణపట్నం పోర్టు, నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది. అటు నెల్లూరులోని పాఠశాలలకు ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటించడమే కాకుండా అన్ని థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ను […]

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..
Ravi Kiran
|

Updated on: Mar 14, 2020 | 2:09 PM

Share

Coronavirus: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించడంతో జగన్ సర్కార్ హై అలెర్ట్ ప్రకటించింది.ఈ మేరకు విశాఖలోని కృష్ణపట్నం పోర్టు, నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది.

అటు నెల్లూరులోని పాఠశాలలకు ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటించడమే కాకుండా అన్ని థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు స్పష్టం చేశారు. ఇక మాల్స్‌ను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు ఎక్కువగా గుంపులుగా తిరగవద్దని.. బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు.

ప్రస్తుతం 9 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతుండగా.. మరో 150 మంది ఈ వైరస్ అనుమానితులు ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. రెండు ప్రత్యేక వైద్య బృందాలు వీరిని పర్యవేక్షిస్తున్నారన్నారు. కాగా, తెలంగాణలోని తొలి కరోనా బాధితుడు ఇటీవల గాంధీ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?