రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

Latest Crime News: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోధ్‌పూర్ సమీపంలో బొలెరో వాహనం, ట్రక్ ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో 11 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన బలోత్రా ఫలోడి రహదారిపై సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తీసి.. మృతదేహాలను బయటికి తీస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి […]

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..
Follow us

|

Updated on: Mar 14, 2020 | 2:08 PM

Latest Crime News: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోధ్‌పూర్ సమీపంలో బొలెరో వాహనం, ట్రక్ ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో 11 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన బలోత్రా ఫలోడి రహదారిపై సంభవించినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తీసి.. మృతదేహాలను బయటికి తీస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమయ్యి ఉంటుందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తి చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?